ఆగని కళ్ళాపి పౌడర్ అమ్మకాలు.. కొనసాగుతున్న మరణాలు.!
ప్రొద్దుటూరులోని ఆరామైన్-ఓ కళ్ళాపి, కుంకుమ రంగు పౌడర్ తయారీ ఫ్యాక్టరీలను అధికారులు సీజ్ చేసినా.. వాటి విక్రయాలు మాత్రం ఆగడం లేదు. మార్కెట్లో వాటిని ఇప్పటికీ విక్రయిస్తున్నారు. జిల్లాలో ఈ పౌడర్ సేవించి 19 మంది సూసైడ్ చేసుకోగా, శనివారం ప్రొద్దుటూరుకు చెందిన సుమంత్, ఎర్రగుంట్లకు చెందిన రేవతి సేవించారు. సుమంత్ మృతి చెందాడు. రేవతి చావు బతుకుల మద్య పోరాటం చేస్తోంది.