ప్రొద్దుటూరులో రోడ్డుపై వైసీపీ V/s టీడీపీ నేతల రచ్చ.!
ప్రొద్దుటూరు-పొట్టిపాడు రోడ్డుపైకి ఆదివారం స్థానిక వైసీపీ, టిడిపి నేతలు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ నేతలు, ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి నాయకత్వంలో టీడీపీ నేతలు వచ్చారు. ఇద్దరు రోడ్డుపై పోటాపోటీగా సై అంటే సై అనడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను అక్కడినుంచి పంపించారు.