గీతాశ్రమం ఉద్యోగులకు జీతాలిచ్చారు.!
ప్రొద్దుటూరు(జూలై, 23): స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమం ఉద్యోగులకు గత ఆరు నెలల జీతాలను గురువారం ఈఓ శ్రీధర్ చెల్లించారు. ఆశ్రమం ఐటి రిటన్స్ సకాలంలో సబ్మిట్ చేయకపోవడంపై ఆశ్రమం బ్యాంక్ ఖాతాలను ఈ ఏడాది జనవరి నుంచి ప్రీజ్ చేశారు. దాంతో జీతాలతో పాటు ఆశ్రమం నిర్వహణకు డబ్బులు డ్రా చేయలేకపోయారు. ఇప్పుడు సమస్య పరిష్కారం కావడంతో ఆశ్రమం ఉద్యోగులకు గురువారం జీతాలు చెల్లించినట్లు ఈఓ శ్రీధర్ తెలిపారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.