ఆశ్రమం ఉద్యోగులకు జీతాలివ్వరా.?
ప్రొద్దుటూరు(జూలై, 23): స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమం (నామా ఎరుకలయ్య ఆశ్రమం) ఉద్యోగులకు జనవరి నుంచి జీతాలు ఇవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగ భద్రతపై సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. వీరికి బీజేపీ నేతలు అండగా నిలిచారు. గురువారం పట్టణ బీజేపీ అధ్యక్షుడు నరేంద్ర ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఆశ్రమం కార్యాలయానికి వచ్చి, జీతాలపై అధికారులను ప్రశ్నించారు. వెంటనే జీతాలివ్వాలని డిమాండ్ చేశారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.