కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!
ప్రొద్దుటూరు(జూలై, 27): స్థానిక కొత్తపల్లె పంచాయతీని ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనం చేయాలని టిడిపికి చెందిన లింగాపురం బ్యాంక్ చైర్మన్ నాగముని రెడ్డి, సినీహబ్ రాజేశ్వరరెడ్డి సూచించారు. వారు సోమవారం పొద్దుటూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మునిసిపల్ కార్పొరేషన్లో ప్రజలకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు. అభివృద్ధి జరుగుతుందన్నారు. కరెప్షన్ తగ్గుతుందన్నారు. ప్రజలంతా విలీనానికి మద్దతుగా ఉన్నారు. కొంతమంది అభివృద్ధి నిరోధకుల ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. - ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.