ప్రొద్దుటూరు పోలీసులపై దౌర్జన్యం చేసిన వ్యక్తిపై కేసు.!
ప్రొద్దుటూరు 1-టౌన్ పోలీసులపై దౌర్జన్యం చేసిన గాలిపోతుల బద్రి అనే వ్యక్తిపై శనివారం కేసు నమోదు చేసినట్లు.సీఐ కొండారెడ్డి తెలిపారు. గాంధీరోడ్డులో మోటార్ సైకిల్లో ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వెళుతున్న బద్రిని బ్రీత్ అనలైజర్ పరీక్షించగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలిందన్నారు. వారిని పోలీస్ స్టేషన్ తరలిస్తుండగా దౌర్జన్యం చేయడంతో కేసు నమోదు చేశామన్నారు.