ఆర్దీని కలిసిన మున్సిపల్ కమిషనర్.!
ప్రొద్దుటూరు(జూలై, 29): ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ బుధవారం అనంతపురం మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ నాగరాజును కలిశారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణ అభివృద్ధికి సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని పారిశుధ్యం డ్రైనేజీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.. మున్సిపల్ పెట్రోల్ బంకులో జరిగిన అవినీతిపై సంబంధిత బాధ్యులపై చర్యలు చేపట్టాలని, వారి నుంచి రికవరీ చేయాలని ఆదేశించారు. కమిషనర్ వెంట ఆర్ఐ రమేష్ ఉన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.