ప్రొద్దుటూరులో ATM కేంద్రాల వద్ద కేటుగాళ్లు.!
ప్రొద్దుటూరులో ఏటీఎం కేంద్రాల వద్ద కేటుగాళ్లు అమాయకులను మోసం చేసి డబ్బులను తస్కరిస్తున్నారు. స్థానిక SBI ATMలో డబ్బులు డ్రా చేయడానికి వచ్చిన వారి కార్డులను మార్పు చేసి, పిన్ నెంబర్లు సేకరించి రూ.1,38,400లు కాజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సోమవారం స్థానిక 1టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టినట్లు సిఐ కొండారెడ్డి తెలిపారు.