ప్రొద్దుటూరులో కేటుగాడు అరెస్ట్ :ASP విభుకృష్ణ
ప్రొద్దుటూరు(జూలై, 15) ఏటీఎం కేంద్రాల్లో సహాయం పేరుతో అమాయకుల ఏటీఎం కార్డులను మార్పు చేసి, పిన్ నెంబర్లను తస్కరించి, వాటితో నగదు డ్రా చేసుకుంటున్న కర్నూలుకు చెందిన సిద్ధేష్ అనే వ్యక్తిని బుధవారం స్థానిక 1టౌన్ పోలీసులు పట్టుకొని అరెస్టు చేసినట్లు ఏఎస్పి విభూకృష్ణ తెలిపారు. నిందితుడి నుంచి రూ.50 నగదు, సెల్ ఫోను, నకిలీ ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇటువంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.