తాళ్లమాపురంలో 550 పశువులకు ఉచిత వైద్యం.!
పొద్దుటూరు వెటర్నరీ కాలేజీ అధ్యాపకులు, స్టూడెంట్స్ శుక్రవారం తాళ్లమాపురం గ్రామంలో 550 పశువులకు ఉచిత వైద్య చికిత్సలు సేవలను అందించారు. ప్రొద్దుటూరు పశుసంవర్ధక శాఖ ఏడి ధనుంజయ రెడ్డి, తాళ్లమాపురం పశు వైద్య అధికారి మాధవరెడ్డి, కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ వైద్యాధికారులు పాండురంగారెడ్డి, ఊర్మిళ, భార్గవి, పృద్వి, రేవతి, విద్యార్థులు పాల్గొన్నారు.