ప్రొద్దుటూరులో ఇద్దరు మిస్సింగ్.!
ప్రొద్దుటూరు 1-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మిస్సింగ్ అయినట్లు వారి కుటుంబ సభ్యులు గురువారం ఫిర్యాదు చేశారు. వసంతపేటకు చెందిన విద్యార్థి శివ రమేష్ చదువుకొమ్మని తండ్రి మందలించాడని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చాపాడు మండలానికి చెందిన యువతి ప్రొద్దుటూరు రామేశ్వరంలో తాతవద్ద ఉంటూ కనిపించడం లేదని తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై సిఐ కొండారెడ్డి విచారణ చేస్తున్నారు.